Stock Market: ఇన్వెస్టర్లకు బ్లాక్ డే.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్ 21 d ago
8K News-13/02/2026 భారీ నష్టాలతో భారత స్టాక్ మార్కెట్లు ముగిశాయి. సెన్సెక్స్ 1,048 పాయింట్లు పతనమై 82,626 వద్ద క్లోజ్ కాగా.. నిఫ్టీ 336 పాయింట్లు పడిపోయి 25,471 వద్ద స్థిరపడింది. మార్కెట్ అంతా రెడ్లో ముగియగా, ఎక్కువ శాతం షేర్లు నష్టాల్లోనే నిలిచాయి. ఎనర్జీ, మెటల్, రియల్టీ రంగాలు 2–3% వరకు పడిపోవడం ఇన్వెస్టర్లను షాక్కు గురి చేసింది.